Saturday, 18 April 2026 02:39:16 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం

Date : 28 September 2025 09:22 PM Views : 415

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో గత ఆరు రోజులు గా 37 వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అని దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి లు తెలిపారు. ఆదివారం 7 వ రోజు శ్రీ శాకాంబరీ దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం సుప్రభాత సేవ అభిషేకాలు, దంపతలచే కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, బిజెపి పార్టీ నాయకులు శాకాంబరీ దేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయనకు దేవాలయం చైర్మన్, ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ మన పెద్దలు సంపద, సనాతన ధర్మం, హిందూ సంస్కృతి సంప్రదాయాలను మనకు అందించారు అని ఇప్పుడు సంపదను కాపాడుకుంటూ, సనాతన ధర్మాన్ని మన పిల్లలకు నేర్పాడం లేదు అని అన్నారు, దైవ భక్తి,దేవతల చరిత్ర గురించి అవగాహన కల్పించాలని సూచించారు. ఆచారి ని,కండె హరిప్రసాద్ ను, స్థానిక బిజెపి పార్టీ నాయకులను దేవాలయం చైర్మన్, ఉత్సవ కమిటీ సభ్యులు శాలువా మెమెంటో తో సన్మానం చేశారు. అనతరం పట్టణానికి చెందిన జే ఎస్ డాన్స్ అకాడమీ నిర్వాహకులు శేఖర్ ఆద్వర్యంలో చిన్నరులచే నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది డాన్స్ మాస్టర్ శేఖర్ ను చిన్నారులను మెమెంటో తో సన్మానం చేశారు. ఆనంతరం వాసవి క్లబ్ అంతర్జాతీయ ఆద్వర్యంలో పది, ఇంటర్, డిగ్రీ లో 98 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు 10 వేల రూపాయల స్కాలర్ షిప్ పట్టణానికి చెందిన 5 మంది విద్యార్థులకు ఈరోజు వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు జూలూరి రమేష్ బాబు, అధ్యక్షుడు బాదం రాఘవేందర్ లు అందజేశారు. ఈసందర్భంగా దేవాలయం చైర్మన్, వాసవి క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు జూలూరి రమేష్ బాబు మాట్లాడుతూ పేద విద్యార్థులకు, మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఉన్నత చదువులకు ఎంతో సహాయం గా ఉంటుంది అని తాను ఇలాంటి ప్రోత్సాహం కోసం 5 లక్షలు 50 మందికి కి సహాయం అందించడం జరిగింది అన్నారు. ఆదే విధంగా సంప్రదాయ బద్ధంగా దుస్తులు అలంకారం తో దేవాలయానికి వచ్చిన మహిళల కు లక్కీ డ్రా ద్వారా ఎంపికైన ఇద్దరికీ రాచూరి రాంమోహన్ సహకారంతో బహుమతులు అందజేశారు. ఆనంతరం పెద్ద మంగళ హారతి దాతల సహకారంతో భక్తులకు అన్న ప్రసాదం వితరణ కార్యక్రమాలు నిర్వహించినట్లు దేవాలయం చైర్మన్ పౌండర్ ట్రస్టీ జూలూరి రమేష్ బాబు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గందె రవి, ఉత్సవ కమిటీ సలహాదారు వాస శేఖర్, కమిటీ ప్రధాన కార్యదర్శులు గుండ్ల రేవంత్, డి నితిన్, కోశాధికారి లు పోల గిరిబాబు, సంబ తరుణ్ లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు సభ్యులు మహిలలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :