కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తెలుగు పేట శివాలయం నందు గద్వాల మత్స్యకారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మత్స్య కార్య దినోత్సవ సందర్భంగా తెలుగు ముదిరాజ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరై తెలుగు ముదిరాజ్ జెండా ను ఎమ్మెల్యే చేతులకు మీదుగా ఆవిష్కరించడం జరిగింది.అనంతరం ఎమ్మెల్యే ను తెలుగు ముదిరాజ్ సంఘం నాయకులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు ముదిరాజ్ సోదరులు లందరికీ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారులు అభివృద్ధి చెందాలి వారి కులవృత్తి అయిన చాపల వేటను మత్స్యకారులకు వృత్తిపరమైన వారికి అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వము కల్పించాలని అన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో మత్స్యకారులను కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వారి సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని సీఎం కి కోరడం జరుగుతుందని తెలిపారు. మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది ఉన్న నా దృష్టికి తీసుకురండి ప్రత్యేకంగా వారికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. అదే విధంగా మత్స్యకారుల అభివృద్ధి కొరకు వారు ఆర్థికంగా బలోపేతం చెంచడం కొరకు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లి మత్స్యకారుల సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్స్ దౌలు,టి. శ్రీను, నరహరి గౌడ్ రిజ్వాన్, నాయకులు గోవిందు సతీష్ వంట భాస్కర్, దౌలన్న లక్ష్మన్న, కురుమన్న, మధు హనుమంతు , ఆంజనేయులు, కొత్త గణేష్ పరశురాముడు, చందు, పాండు, హరి, నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News