కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : ముదిరాజ్ ప్రజా చైతన్య బస్సు యాత్ర కు ముదిరాజ్ నాయకులు రాఘవేంద్ర ముదిరాజ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక ముదిరాజ్ సంఘాల జిల్లా ముఖ్య నాయకులు , వివిధ పార్టీల రాజకీయ నాయకులు మాట్లాడుతూ, యువకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోశించినట్లు నేడు యువత మన జాతి కొరకు సంఘాలు ఏవైనా ముఖ్య అంశం అయిన రిజర్వేషన్ కోసం కష్టపడాలని డా.శివ ముదిరాజ్ బృందాన్ని ఆదర్శంగా తీసుకోవాలని యువకులనుద్దేశించి మాట్లాడారు.ఆ తదనంతరం డా. శివ ముదిరాజ్ గారు మాట్లడుతూ, ముదిరాజుల యొక్క ప్రధాన డిమాండ్లు అయినటు వంటి BC -D నుండి BC -A లోకి రాకపోవడం వల్ల ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక నష్టాలను , సామాజిక వెనకబాటు తనం , రాజకీయ వెనకబాటు తనం గూర్చి చెప్తూ వాటి రూపుమాపాలనే ఉద్దేశ్యంతో యాత్ర చేస్తున్నామని దానికి యువ ముదిరాజుల తోడ్పాటు ఎంతో కీలకమన్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంను ఉద్దేశించి పండగ సాయన్న జయంతి & వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని వేదిక నుండీ కోరడం జరిగింది..అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క పార్టీ కూడా ముదిరాజ్ సోదర, సోదరీమణులకు ఖచ్చితంగా అధిక సంఖ్యలో టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేయటం జరిగింది. యాత్రకు సంఘీభావం తెలుపుతూ సహకరించిన కుల పెద్దలు , వివిధ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .. ఈ బస్ యాత్రలో బ్రహ్మం ముదిరాజ్ , సాయికిరణ్ ముదిరాజ్, మహేష్ బాబు ముదిరాజ్, దశరథం ముదిరాజ్, మురళి ముదిరాజ్,శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ మహాసభ గౌరవ అధ్యక్షులు రేలంపాడు నరసింహులు మదనపల్లి ఆనందు జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి లక్ష్మన్న కోశాధికారి రేకులపల్లి సవరణ జనరల్ సెక్రెటరీ బీచుపల్లి మున్సిపాలిటీ ఘటన కొండపల్లి పరమేష్ కొత్తపల్లి సత్యనారాయణ మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News