కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : గద్వాల పట్టణంలోని 24 వ వార్డు రామాలయం దేవాలయ సమీపంలో శ్రీ దేవి శరన్నవరాత్రిల ఉత్సవాల్లో సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మ వారి ఆశీస్సులు పొందడం జరిగినది. 24వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్వీ ఆర్ రాజు యాదవ్, గోపాల్, మోహన్ యాదవ్, ప్రీతం, శ్రీకాంత్ (లడ్డు) ఎమ్మెల్యే కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ....శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మహిళలు భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. అమ్మ వారి ఆశీస్సులు తో గద్వాల నియోజకవర్గం లో గ్రామాలలో పట్టణ వార్డులలో ప్రజలందరికీ , సకాలంలో వర్షాలు పడిన రైతులకు పాడిపరిశ్రమ అభివృద్ధికి అన్ని వర్గాల వ్యాపారం అభివృద్ధి చెందాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించలని అమ్మ వారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి, కేశవరెడ్డి, 24వ, వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ వి ఆర్ రాజు యాదవ్,గోపాల్, ప్రీతం, శ్రీకాంత్ (లడ్డు), కే.వెంకటేష్, మధు, బద్రి, అనుగొండ శంకర్, బిసి వెంకటేష్, ఎన్.శివాజీ, చక్రధర్ రెడ్డి, సూరిబాబు, భీమేశ్వర్ రెడ్డి, రామన్ గౌడ్,మోహన్ యాదవ్, బద్రి, ప్రకాశం, వీరేష్ యాకోబు జగదీష్ గౌడ్ కిరణ్ గౌడ్ తిరుమల రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది
Admin
Kalam Power News