కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయం కల్వకుర్తిలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురు వారం 8వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఉదయం ప్రాతః కాల పూజలతో మొదలుకొని అభిషేకం ప్రత్యేక పూజలు, దంపతుల చే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించడం జరిగింది. *చండీ యాగం:* ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు. వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట. కావున భక్తులచే 40 మంది జంటలచే చండీ హోమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. తలకొండ పల్లి జెడ్ పి టి సి ఉప్పల వెంకటేష్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ, భక్తులకు బోజన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది.సాయంత్రం మహిళలచే దాండియా కోలాటాలు నిర్వహించడం జరిగింది . *దేవాలయాల ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో* ఉత్సవ కమిటీ అధ్యక్షులు గంప శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నారాయణరాజు, దాచేపల్లి నితిన్ కుమార్, కోశాధికారులు పానుగంటి నవీన్, సంబు తరుణ్, వాస మనీష్, ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు, సంబు ముత్యాలు, వాస శేఖర్, గంధం కిరణ్ ప్రసాద్, గందె రవి, కల్వ రమేష్, గుబ్బ వెంకటేష్, కంది ప్రవీణ్, గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్, శివ జగదీశ్వర్ మరియు ఆర్యవైశ్య సంఘం , వాసవి క్లబ్, అవోప మరియు అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News