కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : చిన్నచిన్న కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దు ఒకే గ్రామంలో ఉండే వారు ఎప్పుడూ కలిసి మెలిసి ఉండాలి రాజీ మార్గమే రాజ మార్గం అని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు.ఈ నెల 28.09.2024 నాడు జరుగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా జిల్లా ఎస్పీ డి జానకి, సోమ వారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు డి.ఎస్.పి లు, సి.ఐ లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి రాజీ పడే కేసులలో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ పడేలా సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. రాజీపడే కేసులలో రాజీపడేటట్లు ఫిర్యాది మరియు ముద్దాయి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించాలని తెలిపారు, మెగా లోక్ అదాలత్ లో సాధ్యమైనంత వరకూ ఎక్కువ కేసులు రాజీ చేయించాలన్నారు. రాజీ పడదగిన కేసుల్లో ఉన్నవారిని పిలిపించి చిన్నచిన్న కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఒకే గ్రామంలో ఉండే వారు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి "రాజీ మార్గం రాజ మార్గమని" వారికి అర్థమయ్యే విధంగా తెలపాలని సూచించారు. అలాగే జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా పిట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రవ్ కేసులు, ట్రాఫిక్ చలనాలు మరియు ఇతర చిన్న చిన్న గొడవల కేసులన్నీంటి లోనూ పరిష్కారం జరుగుతుని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజీ చేసుకోవాలని తెలిపారు.
Admin
Kalam Power News