కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవాలయం కల్వకుర్తి లో శుక్ర వారం శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు అమ్మవారు ధనలక్ష్మి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. 20 లక్షల నగదు తో అమ్మవారిని ఎంతో దేదీప్యమానంగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఉదయం సుప్రభాత సేవతో మొదలై దంపతులచే సామూహిక కుంకుమార్చనలు, అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అవోపా వారిచే అమ్మవారికి తిలక ధారణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దేవతలందరికీ నైవేద్యం సమర్పించి మహా మంగళ హారతి తదుపరి తీర్థ ప్రసాద వితరణ మరియు భక్తులకు భోజన ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం మురళి మనోహర్ పుట్టి చే హిందుత్వం గురించి హిందూ సంప్రదాయాల గురించి ప్రసంగం ఇవ్వడం జరిగింది. మహిళలచే పారాయణం, కోలాటం, దాండియా మొదలగు కార్యక్రమాలు నిర్వహిండం జరిగింది. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ జూలూరు రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గంప శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నారాయణరాజు, దాచేపల్లి నితిన్ కుమార్, కోశాధికారులు పానుగంటి నవీన్, సంబు తరుణ్, వాస మనీష్, ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు దాచేపల్లి శ్రీనివాసులు, సంబు ముత్యాలు, వాస శేఖర్, గంధం కిరణ్ ప్రసాద్, గందె రవి, కల్వ రమేష్, గుబ్బ వెంకటేష్, కంది ప్రవీణ్, గార్లపాటి శ్రీనివాసులు, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి చిగుళ్లపల్లి శ్రీధర్ మరియు ఆర్యవైశ్య సంఘం అనుబంధ అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News