కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జడ్చర్ల : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలో నివాసం ఉంటున్న నెరేళ్ళపల్లి వాసి శివ జగదీష్ చిన్నతనం నుండే డాక్టరేట్ పట్టా పొందాలనే పట్టుదలతో గణితంలో డాక్టరేట్ పోద్దారు. నెరేళ్ళపల్లి గ్రామంలో రామచంద్రయ్య విజయ లక్ష్మి దంపతుల మొదటి కుమారుడు శివ జగదీష్ తన ఇంటర్ నుండే జడ్చర్ల కేంద్రంలో ఉంటూ విద్యను కొనసాగించారు. ఒక వైపు ఉదయం కళాశాలకు వెళ్లడం సాయంత్రం వేళ పిల్లలకు ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టారు. ఆరు సంవత్సరాల కృషితో ఉస్మానియా విశ్వవిద్యాలయం గణిత ప్రొఫెసర్ మర్పడగా చెన్న క్రిష్ణరెడ్డి పర్యవేక్షణలో న్యూమరికల్ అనాలసిస్ ఆఫ్ బౌండరీ లేయర్ ఫ్లో హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ క్యారెక్టర్ స్టిక్స్ ఆన్ నాన్ న్యుటోరియన్ నాను ఫ్లూయిడ్ ఓవర్ ఏ స్ట్రెస్టింగ్ షీట్ అనే అంశంపై శివ జగదీష్ సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా అటు జగదీష్ పుట్టిన గ్రామం ఇటు జడ్చర్ల కేంద్రం నుండి మరియు విద్యార్థులు ,మిత్రులు భారీఎత్తున అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Admin
Kalam Power News