కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవాలయం కల్వకుర్తి లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించి ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడు గంప శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్షులుగా నారాయణ రాజు, దాచేపల్లి నితిన్ కుమార్ కోశాధికారులుగా పానుగంటి నవీన్, సంబు తరుణ్ లను ఎన్నిక చేయడం జరిగింది. దేవాలయ ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో శరన్నవరాత్రి ఉత్సవములకరపత్రాల ఆవిష్కరణ గావించడం జరిగింది. ఉత్సవాలు తేదీ 3-10-2024 న మొదలై 13-10-2024 న ముగియనున్నాయి. పట్టణ మండల ఆర్యవైశ్య బంధువులందరూ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయగలరని రమేష్ బాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, రైస్ మిల్ అసోసియేషన్, అవొప, వాసవి క్లబ్,అనుబంధ సంస్థల సభ్యులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News