కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని అతి పెద్ద ఉపాధ్యాయ సంఘమైన పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గా మహబూబ్ నగర్ కు చెందిన ఆ యూనియన్ సీనియర్ నేత అశ్విని చంద్ర శేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు జరిగిన పి ఆర్ టి యూ టి ఏస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో రాష్ట్ర అధ్యక్షులు గా పింగళి శ్రీ పాల్ రెడ్డి, ప్రధాన కార్య దర్శిగా పులగం దామోదర్ రెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా పి ఆర్ టి యూ టి ఎస్ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి.మదన్ మోహన్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జి.సుధాకర్ రెడ్డి ల ప్రతి పాదన మేరకు రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్ష పదవికి అశ్విని చంద్ర శేఖర్ తిరిగి రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్ జి టి ఉపాధ్యాయులు గా విధులు నిర్వర్తిస్తున్న అశ్విని చంద్ర శేఖర్ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా 17 అక్టోబర్ 2002 న నియామక మైన నాటి నుంచి నేటి వరకు 22 ఏళ్లుగా ఒక వైపు విద్యా భివృద్ధికి అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ మరో వైపు ఉపాధ్యాయ సమస్యల సాధనయే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్న పి ఆర్ టి యూ టి ఎస్ లో ప్రాథమిక, క్రియాశీలక సభ్యులుగా మండల ప్రధాన కార్యదర్శి గా, అధ్యక్షులుగా, జిల్లా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా , రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా సమర్థవంతంగా పనిచేస్తూ ఉపాధ్యాయులకు అందిస్తున్న సేవలకు, పి ఆర్ టి యూ టి ఎస్ పటిష్టతకు తనదైన శైలిలో కృషి చేస్తున్న అశ్విని చంద్ర శేఖర్ సేవలను గుర్తించి అధిష్టానం మరో సారి రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా అవకాశం కల్పించడం అభినందనీయం. *బాధ్యత యుతంగా పనిచేస్తా : అశ్విని చంద్ర శేఖర్* విద్యా, ఉపాధ్యాయ సమస్యల సాధనకై బాధ్యత యుతంగా పనిచేస్తానని పి ఆర్ టి యూ టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన అశ్విని చంద్ర శేఖర్ అన్నారు. అధిష్టానంపై తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికీ అందు బాటులో ఉoటూ యునియన్ పటిష్టతకు శక్తి వంచన లేకుంగా కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమానికి నిర్విరామంగా కృషి చేస్తానని అన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఏక గ్రీవ ఎన్నికకు సంపూర్ణ సహాయ సహకారం అందించిన రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు జి.మదన్ మోహన్ యాదవ్ , ప్రధాన కార్యదర్శి జి.సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్ష,కార్యదర్శులు గడ్డం అంజయ్య, రఘువర్ధన్ రెడ్డి లతో పాటు మండల, జిల్లా, రాష్ట్ర నాయకులకు ఈ సందర్భంగా అశ్విని చంద్ర శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.
Admin
Kalam Power News