కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : మహబూబ్నగర్, మార్చి 6 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) : మహబూబ్నగర్ జిల్లా మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సీఎం కార్యక్రమానికి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్. వినోద్ కుమార్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాదిగ ఉద్యోగుల ఐక్యతను అభినందిస్తూ కార్యక్రమానికి వెళ్తున్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ ఉద్యోగులు సామాజిక చైతన్యంతో ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ తరహా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ సందర్భంగా మాదిగ ఎంప్లాయిస్ ప్రతినిధులు మాట్లాడుతూ బస్సు ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపిన ఎస్. వినోద్ కుమార్ కు తమ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు, ఉద్యోగులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News