Saturday, 18 April 2026 02:18:21 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

“అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.!

ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశగా నెడుతోందని, ఇది సంక్షేమ బడ్జెట్ కాదని, కేవలం అంకెల గారడీ మాత్రమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు

Date : 21 March 2026 07:35 PM Views : 218

కలం పవర్ న్యూస్ - రాజకీయం / మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ మార్చి 20 ( కలం పవర్ న్యూస్ బ్యూరో ) రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై మాజీ మంత్రి విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందని, మూడు బడ్జెట్లు పూర్తయినా ఒక్క వర్గానికీ న్యాయం జరగలేదని ఘాటుగా విమర్శించారు. పాత మొతి నగర్ కార్పొరేటర్ సిద్ధిఖీ నివాసం లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం మూడో బడ్జెట్‌లో అయినా సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతుందని ప్రజలు ఆశించారని, కానీ ఆ ఆశలను పూర్తిగా వమ్ము చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 11 డిక్లరేషన్‌లకు అనుగుణంగా ఎలాంటి ప్రణాళికలు బడ్జెట్‌లో కనిపించలేదని ఆరోపించారు. బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్లు, ఐదేళ్లలో లక్ష కోట్లు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, కేవలం 3.85 శాతం మాత్రమే కేటాయించడం దారుణమని, అందులోనూ రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడం బీసీలను మోసం చేయడమేనని అన్నారు. బీసీ గురుకులాల్లో సరైన ఆహారం లేక విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, మైనారిటీ గురుకులాల్లో వసతుల లోపంతో విద్యార్థులు వెళ్లిపోతున్నారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారని, పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వడం లేదని, పదవీ విరమణ పొందిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా నిలిపివేస్తున్నారని విమర్శించారు. రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని పేర్కొంటూ, రైతు బంధు అమలు సరిగా లేదని, కరెంటు సరఫరా లోపాలు, యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టులు, గురుకులాలు, మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆస్పత్రులు విస్తృతంగా అభివృద్ధి చెయ్యడంతో రాష్ట్ర సంపద పెరిగిందని, ప్రజల ఆస్తుల విలువలు పెరిగాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ అభివృద్ధి దిశగా రాష్ట్రం సాగుతోందా లేదా వెనక్కి వెళ్లుతోందా అన్నది ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. బీసీలకు రూ.50 వేల కోట్లు, దళితులకు రూ.10 లక్షల పథకానికి తగిన బడ్జెట్ కేటాయించాలని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రత్యేక సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక సమానత్వం ఇంకా అందలేదని అన్నారు. ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని తిరోగమన దిశగా నెడుతోందని, ఇది సంక్షేమ బడ్జెట్ కాదని, కేవలం అంకెల గారడీ మాత్రమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒత్తిడి తెచ్చి, అన్ని వర్గాలకు నిజమైన సంక్షేమ ఫలాలు అందించేలా బడ్జెట్ రూపకల్పన చేయించాలని కోరారు. ఈ సమావేశంలో మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, కార్పొరేటర్లు సిద్ధికి, లక్ష్మి నరేష్, మాజీ కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :