Saturday, 18 April 2026 02:14:23 PM
# పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం.. # కల్వకుర్తిలో రంగుల సంబరం – వాసవి దేవాలయంలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు # మహబూబ్ నగర్ ‘క్యాంప్’ రాజకీయం - శకుని పాత్రధారులు ఎవరు.? - ఎదుగుతున్న బీసీ నేతపై ‘శకుని చక్రబంధనం’.. # సేవలలో అగ్రగామి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ : వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరి రమేష్ బాబు

కల్వకుర్తి లో వడ్ల కుంభకోణం..!!- ఇతర రాష్ట్రాలకు సీఎంఆర్ వడ్ల అమ్మకాలు.? - ధాన్యం ధరలు పెరగడంతో కస్టమ్ మిల్లింగ్ రైస్ వడ్లను అమ్ముకుంటున్న మిల్లర్స్.

ప్రభుత్వానికి పంపని సిఎంఆర్ మిల్లులలో నిల్వలు ఉన్నాయా..? మిల్లర్ల మాయాజాలం ..! https://youtube.com/shorts/WUI0NEh2WDE?si=argrzA1txKIHM6PL

Date : 29 December 2023 05:47 PM Views : 1682

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : మిల్లర్లు మాయాజాలం చూపిస్తున్నారు.. కల్వకుర్తి నియోజకవర్గంలో కొందరు మిల్లర్లు తమకు కేటాయించిన సి ఎం ఆర్ ను సివిల్ సప్లయ్ కి తిరిగి చెల్లించకుండా కాసుల కక్కుర్తితో పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే బియ్యం మాఫియాకు కేంద్ర బిందువుగా పేరుగాంచిన కల్వకుర్తిలో మిల్లర్లు గత కొంతకాలంగా కొత్త కుంభకోణానికి తెరలేపారు. వడ్ల ధరలు అధికంగా పెరగడంతో కస్టమ్ మిల్లింగ్ కింద తమకు కేటాయించిన వడ్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇతర వ్యాపారాలు చేసి అప్పుల్లో కురుకుపోయిన వారు సైతం లాభసాటి గా మారిన రైస్ మిల్ బిజినెస్ ను ఎంచుకుని ముత పడ్డ మిల్లులను సైతం లిజుకి తీసుకోవడం తో పాటు 2022-2023 సంవత్సర కాలంలో కల్వకుర్తి చుట్టుపక్కల ప్రాంతాలలో కొత్తగా పలు రైస్ మిల్లుల నిర్మాణాలు చేపట్టారు. అందినకాడికి తిందామని యోచనలో వున్న అధికారుల చేతివాటంతో మిల్లుల నిర్మాణం పూర్తి కాకముందే విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వక ముందే మన నాగర్ కర్నూల్ జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు పెద్ద మనసు చేసుకొని పలు మిల్లులకు వరి ధాన్యాన్ని కేటాయించారు. అందులో భాగంగానే సంజాపూర్ దగ్గర ఓ మిల్లు రోడ్డ్ వైన్డింగ్ లో పోతుండగా.. ప్రభుత్వం తరపున ఆ మిల్లు యజమానుల కు భారీగానే నష్టపరిహారము అందుకొన్నారు. అంతటితో దన ధాహం తీరని దళారులు సిఎంఆర్ కింద ఇచ్చిన ప్యాడిని అమ్మేసుకున్నారు. ప్రభుత్వానికి పంపాల్సిన బియ్యాన్ని మాత్రం పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ మిల్లుకు రైతులు తెచ్చే వడ్లను మాత్రం బియ్యంగా మారుస్తూ వారి పనులు చక్కదిద్దుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి సీఎంఆర్ చెల్లించకుండా మిల్లర్లు మీన వేషాలు వేస్తూ జాప్యం చేస్తున్న అధికారులు మాత్రం చోద్యం చూస్తూనే ఉండిపోతున్నారు. పట్టణ పరిధిలో నూతనంగా నిర్మించిన రైస్ మిల్లర్లు సీఎంఆర్ కింద వడ్లు తీసుకోని మొత్తం ఇతర రాష్ట్రాలకు తరలిస్తు కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటూ కొత్త కుంభకోణానికి తెరలెపారు. ఇదే లాభదాయకమని ఒక్కో వ్యాపారస్తుడు రెండు, మూడు, స్వంతంగా నాలుగు మిల్లుల వరకు నిర్మాణలు చేపడుతూ ప్రభుత్వం నుండి ప్యాడి ని సేకరించి ఇతర రాష్ట్రాలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా నిర్లక్ష్యం గా పని చేస్తున్నారని కొందరు పిర్యాదు నిమిత్తం ఫోన్ చేస్తే ఏత్తకుండా తప్పించుకుంటున్నారు అని పిర్యాదు దారులు పేర్కొనడం గమనార్హం. -ప్రభుత్వానికి పంపని.. సిఎంఆర్ మిల్లులో నిల్వలు ఉన్నాయా..? లేవా..!! సీఎంఆర్ చెల్లింపులలో పెద్ద ఎత్తున జాప్యం జరుగుతున్నప్పటికీ అధికారులు కనీసం ఒక్క మిల్లునైనా తనిఖీ చేసిన పాపాన పోలేదని సీఎం ఆర్ కోసం ఇచ్చిన వడ్లు మిల్లులలో, గోదాములలో ఉన్నాయా..? లేవా..? అనే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దళారులు శృతిమించి పోతున్నారు. ప్రభుత్వానికి సకాలంలో చెల్లించకుండా తమ దగ్గర ఉన్న వడ్లను అమ్ముకొని లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు వున్న నేపద్యంలో ఇప్పటికైనా సివిల్ సప్లై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ సి ఎం ఆర్ సప్లయ్ విషయంలొ దృష్టి సారించి మిల్లర్ల పై కఠినంగా వ్యవహరించి సివిల్ సప్లై లో జరిగే కోట్ల రూపాయల కుంభకోణాన్ని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :