కలం పవర్ న్యూస్ - తెలంగాణ / మహబూబ్ నగర్ : ఎమ్మెల్సీ పదవితో నాపై మరింత బాధ్యత పెరిగిందని, యువతకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తానని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన 'మాట్లాడారు. రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దేశ చరిత్రలో 31 ఏళ్ల చిన్న వయస్సులో తనకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ. రాహుల్ గాందీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర ఎమ్మెల్యేలు, నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్న. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ఎస్ యూ ఐ ను సన్నద్ధం చేయడానికి మహబూబ్నగర్ నుంచే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ఎస్ యూ ఐ నాయకులు ప్రతి ఓటరు వద్దకు వెళ్లి కాంగ్రెస్ సిద్ధాంతాలు, కార్యక్రమాల గురించి వివరించాలన్నారు. ప్రతి యువకుడిని చైతన్య పరిచి ప్రతి పార్లమెంట్ నుంచి లక్షమెజార్టీకి తక్కువగా కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుందామని అన్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా అత్యధిక సమయం కేటాయించి వంశీచంద్ రెడ్డి గెలుపులో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. సమావేశంలో సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, జిల్లా మీడియా సెల్ సీజే బెనహర్, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అవేజ్, రాష్ట్ర కార్యదర్శి ముకుందం రమేశ్, నాయకులు లలిత్ యాదవ్, కృష్ణవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News