కలం పవర్ న్యూస్ - ఆధ్యాత్మికం / Kurnool : కలంపవర్ న్యూస్, శ్రీశైలం:శ్రీశైల మహా క్షేత్రంలో జరుగుతున్న కార్తీక మహోత్సవాల సందర్భంగా దేవస్థానం వారు నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమంలో భాగంగా దేవస్థానం పంచ సహస్రవధాని ప్రముఖ ప్రవచకులు డాక్టర్ మేడసాని మోహన్ చే,మూడు రోజులపాటు జరగనున్న శివానందలహరి ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఇందులో భాగంగా మొదటి రోజు మంగళవారం నాడు ప్రవచకుల తో పాటు దేవస్థానం ఈవో పెద్దిరాజు, అర్చక స్వాములు వేద పండితులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రవచకులు మోహన్ మాట్లాడుతూ, ఆదిశంకరాచర్యులు రచించిన శివానందలహరి గ్రంధాన్ని శ్రీశైల క్షేత్రంలోనే రాసినట్లు తెలిపారు.
Reporter
Kalam Power News